హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 100 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ క్యాంపస్ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యాంపస్ ఏర్పాటయితే.. బాసరలో మాత్రమే ఉన్న ట్రిపుల్ ఐటీ విద్య ఇప్పుడు హనుమకొండలో కూడా అందుబాటులోకి రానుంది. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల విద్యార్థులకు అనువుగా ఉండేలా ఎల్కతుర్తిని ఎంపిక చేశారు. గురువారం (మార్చి 13న) హన్మకొండ జిల్లాకు వచ్చిన అధికారులు.. క్యాంపస్ ఏర్పాటుకు భూమిని పరిశీలించి, కలెక్టర్తో చర్చలు జరిపారు. రెండేళ్లలో క్యాంపస్ సిద్ధం కావచ్చని అధికారులు చెప్తున్నారు.
హన్మకొండ జిల్లాలో కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్య సులభతరం కానుంది. బాసరలో మాత్రమే ఉన్న ట్రిపుల్ ఐటీ ఇప్పుడు హనుమకొండలో కూడా అందుబాటులోకి రానుండటం విశేషం. ఎల్కతుర్తి మండల కేంద్రంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో ట్రిపుల్ ఐటీలో మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చి, మరింత మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది.
వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు కూడలిగా ఉండటంతో పాటు విద్యార్థులకు అనువుగా ఉండేలా ఎల్కతుర్తిని ఎంపిక చేశారు. ప్రారంభంలో 50 ఎకరాల భూమిని తీసుకోవాలని ప్రతిపాదించినప్పటికీ.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో 50 ఎకరాలు కలుపుకొని మొత్తం 100 ఎకరాల స్థలంలో క్యాంపస్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విస్తరణ కోసం బాసర ట్రిపుల్ ఐటీ ఇంఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, హైదరాబాద్ జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ గురువారం (మార్చి 13న) హనుమకొండ జిల్లాకు వచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ A. వెంకట రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రథోడ్ రమేష్, తహసీల్దార్ జగత్ సింగ్ మరియు స్థానిక అధికారులతో కలిసి ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. క్యాంపస్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను పరిశీలించిన అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రవీణ్యతో సమావేశమయ్యారు. ట్రిపుల్ ఐటీ ఎక్స్టెన్షన్ క్యాంపస్ ఏర్పాటు గురించి కలెక్టర్కు వివరించారు. ఎల్కతుర్తిలో గుర్తించిన భూముల గురించి కలెక్టర్తో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విస్తరణకు భూమిని కేటాయించాలని వారు కోరారు.
కలెక్టర్ ప్రవీణ్య, ఎల్కతుర్తి మండల అధికారులు, అదనపు కలెక్టర్ వెంకట రెడ్డితో ప్రభుత్వ భూముల గురించి చర్చించారు. క్యాంపస్ ఏర్పాటుకు భూమిని అప్పగించడానికి అంగీకారం తెలిపారు. రెండేళ్లలో క్యాంపస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో రాష్ట్రంలో మరిన్ని ట్రిపుల్ ఐటీ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో మరిన్ని మంది విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa