సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలోని సప్త ప్రాకారహిత దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa