తమ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు నిరసన తెలిపారు.మంగళవారం ఉదయం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అసెంబ్లీ వద్దకు తీసుకువచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa