ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకుబీవైడీ ఎలక్ట్రిక్ కార్ల యూనిట్‌.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే సాధ్యమైంది: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 06:03 PM

తెలంగాణలో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. హైదరాబాద్ నగరంలో సంస్థలను ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా కార్యకలపాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనాకు చెందిన విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ BYD రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో కార్ల యూనిట్‌ స్థాపించేందుకు రెడీ అయింది.


ఈ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా... ఇటీవల తమ తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు తెలిసింది. ఇండియాలో సొంత యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు బీవైడీ రెండేళ్లుగా కసరత్తు చేస్తుండగా.. చైనా పెట్టుబడులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనలు విధించింది. దీంతో ఇప్పటివరకు ప్లాంటు ఏర్పాటు సాధ్యం కాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో.. ఇండియాలో తొలి యూనిట్‌ పెట్టేందుకు బీవైడీ రెడీ అయింది.


తెలంగాణ బీవైడీ యూనిట్ ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు 2022-23లోనే బీవైడీ, ఓలెక్ట్రాతో జర్చలు జరిపినట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధాన నిర్ణయం కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయిందని చెప్పారు. చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా నిబంధనలను భారత ప్రభుత్వం ఇటీవల సడలించడం వల్ల పెట్టుబడికి మార్గం సుగమమైందని.. అందుకు తాము సంతోషిస్తున్నట్లు తెలిపారు.


తమ ప్రభుత్వ హయంలో ఈవీ అండ్  ఈఎస్ఎస్ విధానాల వల్లనే బీవైడీ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని తాము గర్వంగా చెప్పగలమని అన్నారు. ఫార్ములా ఈ కారు రేస్ కూడా అందులో భాగమేనని.. భారతదేశ ఈవీ రంగానికి తెలంగాణను మొబిలిటీ వ్యాలీ కేంద్రంగా మార్చడానికి ఇది ఒక సమగ్ర ప్రణాళిక అని కేటీఆర్ వ్యాఖ్యనించారు. అందుకు బీవైడీ పెట్టుబడే ప్రత్యక్ష ఫలితమని పునరుద్ఘాటించారు. తెలంగాణలో బీవైడీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com