ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాస్టర్ మృతిపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 08:24 PM

పాస్టర్ ప్రవీణ్ మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన అంత్యక్రియలు సికింద్రాబాద్‌లో ముగిశాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది క్రైస్తవ మతస్థులు హాజరై సంతాపం వ్యక్తం చేశారు. అయితే తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com