కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు నమోదు చేయగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించగా.. వారిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించటంతో భారీ ఊరట లభించనుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూముల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని హెచ్సీయూ విద్యార్థులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అభివృద్ధి పేరుతో కంచ గచ్చిబౌలి భూములను అమ్మితే ఊరుకునేది లేదంటూ ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం చేపట్టిన పనులను విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో.. ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణ నెలకొనగా.. అందుకు కారణమైన పలువురు విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా.. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం వైఖరిని పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు.
కాగా.. ఇదే విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. మంత్రులతో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ నటరాజన్ పాల్గొన్నారు. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు కూడా హాజరయ్యారు. విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలని, యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పోలీసులను తొలగించాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలంటూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు కోరారు.
వారి విజ్ఞప్తుల మేరకు.. విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థుల కేసుల ఉపసంహరణకు కూడా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్నికోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa