ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగొచ్చిన మావోలు.. శాంతి చర్చలకు రావాలని పిలుపు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 07:24 PM

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మావోయిస్టులు కాస్త దిగొచ్చినట్లు తెలుస్తోంది. సైనిక ఆపరేషన్ వెంటనే ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలని బస్తర్ ఇన్ఛార్జ్ రూపేశ్ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఈ లేఖపై పోలీసులు ఇంకా స్పందించలేదు. శాంతి చర్చలపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, ఇప్పటికి నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa