ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ సమ్మె వాయిదా.. చర్చలు విజయవంతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 03:34 PM

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చలు సఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు.
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, పలువురు కీలక డిమాండ్లపై స్పష్టత లభించిందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన సమావేశంలో, ఉద్యోగుల భద్రత, వేతనాలు, పదోన్నతులపై సమగ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa