ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడ్చల్ పట్టణంలో దొంగతనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 02:44 PM

మేడ్చల్ పట్టణ పరిధిలో మార్కెట్లో ఉన్న రెండు దుకాణాల్లో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని దుండగులు బుధవారం తెల్లవారుజామున మనీష్ ట్రేడర్స్, అగర్వాల్ ట్రేడర్స్ దుకాణాల్లో షట్టర్లను పైకి లేపి లోనికి ప్రవేశించారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును తస్కరించారు. అగర్వాల్ ట్రేడర్స్ నుంచి రూ. 3. 50 లక్షలు, మనీ స్టేడర్ నుంచి రూ. 35 వేలు దొంగిలించారు. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న ఏ సి పి శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ, డి ఐ సుధీర్ కృష్ణ ఘటనా స్థలానికి వెళ్లి, దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa