బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ గురువారం నాడు జిల్లాలో మూడు మండలాలకు నూతన అధ్యక్షులను నియమించారు. కొత్తపల్లి, గుండుమాల్ ఉమ్మడి మండలాల అధ్యక్షుడిగా కేశవరెడ్డి, బొమ్రాస్ పేట మండల అధ్యక్షుడిగా శ్రవణ్ గౌడ్, దుద్యాల మండల అధ్యక్షుడిగా నారాయణ యాదవ్ నియమితులయ్యారు.
ఈ నియామకాలు మూడేళ్ల పదవీకాలానికి వర్తిస్తాయని సత్య యాదవ్ తెలిపారు. నూతన అధ్యక్షులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, స్థానిక స్థాయిలో బీజేపీ బలోపేతానికి పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం కొనసాగించడంలో నేతలు కీలకపాత్ర వహించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa