ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాన్ని సందర్శించారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 08:04 PM

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ  కార్యాలయాన్ని సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో, దానిని పునరుద్ధరించుకునేందుకు వ్యక్తిగతంగా ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు.లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా నాగార్జున అక్కడ అవసరమైన లాంఛనాలను పూర్తి చేశారు. అధికారులు సూచించిన మేరకు ఆయన తన ఫొటోను అందించడంతో పాటు, సంబంధిత పత్రాలపై సంతకం చేశారు.తమ అభిమాన నటుడు నాగార్జున స్వయంగా కార్యాలయానికి రావడంతో అక్కడి సిబ్బంది, అధికారులు ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. నాగార్జున కూడా వారిని నిరాశపరచకుండా వారితో కలిసి సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. సిబ్బందితో కాసేపు ముచ్చటించి, అనంతరం తన వాహనంలో అక్కడి నుంచి నిష్క్రమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa