ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మ్యూజియంలలో ఉచిత ప్రవేశం, కారణం ఏంటంటే?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 12:58 PM

నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలలోకి ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్‌ఐ) వెల్లడించింది. ఈ నిర్ణయంతో దేశంలోని పలు చారిత్రక కట్టడాలను, మ్యూజియంలను ఎలాంటి రుసుము చెల్లించకుండానే సందర్శించే అవకాశం ప్రజలకు లభించింది.దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, చరిత్ర గొప్పదనాన్ని వారికి తెలియజేయడమే ఈ ఉచిత ప్రవేశం కల్పించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఏఎస్‌ఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా అత్యంత విలువైన, అరుదైన పురావస్తు కళాఖండాలు కొలువుదీరిన 52 మ్యూజియంలలోకి ఉచితంగా వెళ్లే అవకాశాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా తమ సంస్థ పరిధిలో ఉన్న సుమారు 3,698 చారిత్రక ప్రదేశాల్లో కూడా ఈ ఉచిత ప్రవేశ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత తాజ్‌మహల్‌, ఎర్రకోటతో పాటు తెలంగాణలోని చారిత్రక కట్టడాలైన చార్మినార్‌, గోల్కొండ కోటలను కూడా ప్రజలు ఉచితంగా సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa