చైనాలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ ట్వీట్ చేసింది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో తక్షణ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa