మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బీర్ల రేట్లను భారీగా పెంచిన ప్రభుత్వం... ఇప్పుడు మద్యం ధరలను పెంచింది. క్వార్టర్ కు రూ.10, హాఫ్ కు రూ. 20, ఫుల్ బాటిల్ కు రూ. 40 పెంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి నెల అదనంగా రూ. 160 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. అయితే, చీప్ లిక్కర్ ధరను మాత్రం ప్రభుత్వం పెంచకపోవడం గమనార్హం.
![]() |
![]() |