ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాళేశ్వరం'పై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు: KTR

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 22, 2025, 04:31 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు అని విమర్శించారు. 'సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం తేలిపోయింది. ఈ కాంగ్రెస్, బీజేపీ కలసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa