ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో భారీ సభలకు కాంగ్రెస్ ప్లాన్.. సీఎం రేవంత్‌తో ఖర్గే, రాహుల్ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 04:50 PM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, కొందరు మంత్రుల శాఖలలో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై చర్చించారు. అలాగే, రాష్ట్రంలో భారీ బహిరంగ సభల ఏర్పాటుకు తేదీలను ఖరారు చేసే విషయంపైనా సమీక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించారు. ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సభల ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తమ ప్రభావాన్ని మరింత పెంచేందుకు వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa