సేంద్రియ సాగు విధానంపై రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. త్వరలో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో సేంద్రియ సాగు విధానంపై అవగాహన కల్పించనున్నారు. అయితే కూరగాయల సాగుకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం లేదని, ఆయా చోట్ల పనిచేసే వంట మనుషులు, క్లీనింగ్ స్టాఫ్తో చేయించవచ్చునని అధికారులు చెబుతున్నారు. తొలుత టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర, గోంగూర, పచ్చిమిర్చి లాంటి విత్తనాలను వేసి పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్స్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడంలో భాగంగా వంట మనుషులకు కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎ్సఎ్సఏఐ) ఆధ్వర్యంలో శిక్షణనిప్పిస్తున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనాలు తయారు చేయడంపై, వంట గదులు, వంటపాత్రల శుభ్రతపై ఇటీవల అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa