ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రో ఫేస్-2పై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం.. కిషన్ రెడ్డి ఆరోపణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 03:31 PM

హైదరాబాద్ మెట్రో ఫేస్-2 ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవలే డిపీఆర్ కేంద్రానికి చేరినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మెట్రోపై సరైన అవగాహన లేకుండా మాట్లాడుతోందని ఆయన విమర్శించారు. మెట్రో లైన్ల నిర్వాహణ, నష్టాల భర్తీ, గతంలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు రెండో దశ బాధ్యతలు అప్పగిస్తారా లేక కొత్త సంస్థతో సమన్వయం ఎలా ఉంటుందనే వివరాలను రాష్ట్రం కేంద్రానికి తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం హైదరాబాద్ మెట్రో విషయంలో రాష్ట్రానికి సహకారం, నిధులు అందించడానికి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు మోడీ సర్కార్ సన్ముఖంగా ఉందని ఆయన వెల్లడించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇంకా అందించాల్సి ఉందని, ముఖ్యమంత్రికి మెట్రోపై సరైన అవగాహన లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్ర అంశాలను తాను పలుమార్లు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లానని కిషన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వేసే అనవసర ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని, కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్లు ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ కేసీఆర్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేస్-2 ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, స్పష్టత అవసరమని ఆయన పేర్కొన్నారు, ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa