హైదరాబాద్ వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపటి నుంచి భారీ వర్షాల తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశముండడంతో, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వానలు తీవ్రతతో పాటు పిడుగులు పడే అవకాశమూ ఉన్నందున రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కూడా ఉన్నాయి. వరదలు, రహదారులపై నీటి నిల్వ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానిక పాలనా సంస్థలకు వాతావరణ శాఖ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa