ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్‌ జట్టులో కీలక మార్పు

sports |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 02:05 PM

ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శన కనబరిచిన పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ను తప్పించి అతని స్థానంలో జోష్‌ టంగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మార్పుతో పాటు మిగతా జట్టులో ఎలాంటి మార్పులు లేవని, స్పెషలిస్టు స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌కు బదులుగా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ కొనసాగుతారని తెలిపారు. ఈ మూడో టెస్టు బుధవారం నుంచి అడిలైడ్‌లోని అడిలైడ్‌ ఓవల్‌ మైదానంలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa