మహారాష్ట్రలోని జల్గావ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్తో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా.. ఆరేళ్ల బాలిక, ఎనిమిదేళ్ల బాలుడు, మరో వ్యక్తి ఉన్నారు. అయితే ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారని స్థానికులు వెల్లడించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa