TG: పార్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగిలింది. ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ ఐదుగురి విచారణ తరువాత మిగతా ఐదుగురికి కూడా నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. అయితే, తమకు నోటీసులు అందాయని, చట్టాన్ని గౌరవిస్తామంటూ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa