ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్న పార్టీలివే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 05:09 PM

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. తెలంగాణకు చెందిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ (బీజేడీ), పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఓటింగ్‌లో పాల్గొనకూడదని ప్రకటించాయి. ఈ మూడు పార్టీలు ఏ కూటమికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలవనున్నాయి.తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సోమవారం ప్రకటించారు. పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. రైతుల సమస్యల నేపథ్యంలోనే తాము ఈ ఎన్నికలో ఎవరికీ మద్దతివ్వకుండా, తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa