జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోదావరి నది తీరంలో 2027లో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పుష్కర ఘాట్లను పరిశీలించారు. దేవదాయ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ నిర్వహించిన దూర దృశ్య మాధ్యమ సమావేశం అనంతరం ఈ పరిశీలన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ కూడా పాల్గొన్నారు. పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించే దిశగా ఈ పర్యటన సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa