తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో SEP 26న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలని తెలిపింది. ఈ సందర్భంగా పిల్లల చదువు, హాజరు, వారి ప్రవర్తనపై చర్చించాలని సూచించింది. తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకోవాలంది. నాణ్యమైన విద్య, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి నెలా ఈ సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa