ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్‌-ముంబై మార్గంలో పలు రైళ్లు ఆలస్యం, రీషెడ్యూల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 10:47 AM

కుర్దువాడి-షోలాపూర్‌ మధ్య రైల్వే వంతెనపై ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తుండటంతో సికింద్రాబాద్‌-ముంబై మార్గంలో పలు ముఖ్యమైన రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ కారణంగా, 22731 ముంబై సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 10గంటలు ఆలస్యం కావడంతో హుస్సేన్‌సాగర్‌ (12701) ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్‌ చేశారు. ముంబై-సికింద్రాబాద్‌ దురం తో ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌- పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా రీషెడ్యూల్‌ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa