హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ టాటా ఏఐజీ, దేశంలోని పెద్ద హాస్పిటల్స్ చైన్లలో ఒకటైన మ్యాక్స్ హాస్పిటల్స్లో తమ క్యాష్లెస్ సేవలను నిలిపివేసింది. ఇప్పటికే స్టార్ హెల్త్, నివా బూపా, కేర్ హెల్త్ వంటి సంస్థలు నగదు రహిత సదుపాయం నిలిపివేయగా, ఇప్పుడు టాటా ఏఐజీ కూడా అదే బాటలో నడిచింది. టారిఫ్ రేట్ల విషయంలో తలెత్తిన వివాదమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.ఈ విషయంపై మ్యాక్స్ హాస్పిటల్స్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. టాటా ఏఐజీ సంస్థతో తమకు 2025 జనవరి 16 నుంచి 2027 జనవరి 15 వరకు రెండేళ్ల పాటు టారిఫ్ ఒప్పందం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ఏడాది జులైలో టాటా ఏఐజీ ఆకస్మికంగా సమావేశమై, ఒప్పందానికి విరుద్ధంగా రేట్లను తగ్గించాలని డిమాండ్ చేసిందని ఆరోపించింది. తాము అందుకు అంగీకరించకపోవడంతో, సెప్టెంబర్ 10 నుంచి ఏకపక్షంగా క్యాష్లెస్ సేవలను నిలిపివేశారని మ్యాక్స్ హాస్పిటల్స్ ప్రతినిధి వివరించారు.మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన టాటా ఏఐజీ, తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొంది. క్లెయిమ్లన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పరిష్కరిస్తున్నామని, పాలసీదారులు అంతరాయం లేకుండా చికిత్స పొందేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa