ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి సరఫరాకు అంతరాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 12:24 PM

మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం రాంరెడ్డిగూడెం పంపు హౌస్ వద్ద మిషన్ భగీరథ నీటి సరఫరాకు బుధవారం అంతరాయం ఏర్పడనుంది. పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తా, రామ్ రెడ్డి పంప్ హౌస్ వద్ద మరమ్మతు పనులు చేపట్టనున్నందున, గురువారం మధ్యాహ్నం వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ వాసులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa