తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ఎన్నికల ముందస్తు రాజకీయ హడావుడి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా అభిప్రాయపడ్డారు.‘కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ 22 నెలల పాటు అండర్వర్డ్గా ఉండి ఇప్పుడు అకస్మాత్తుగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హడావుడి చేస్తున్నది. చట్టబద్ధంగా ఈ హక్కులు ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఆ చట్టబద్ధత ఎక్కడ?’ అని ఆయన ప్రశ్నించారు.హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ జరుగుతుండగా, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు జరిపారు. ‘గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్గా ఉండగా, జీవోని ఎందుకు జారీ చేశారు? ఇది హైకోర్టు కూడా తెలుసుకోవాలనుకుంటోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల నేపథ్యంలో కులగణన, రిజర్వేషన్లు మార్గంగా వాడటం స్పష్టమైన ఎన్నికల డ్రామానే’ అని ఆయన పేర్కొన్నారు.‘ఎన్నికల తర్వాత కోర్టు ఈ జీవోను తప్పుడు అని చెప్పి రద్దు చేస్తే పరిస్థితి ఏంటి? గెలిచినవారు, భారీ ఖర్చులు చేసిన వారు ఎక్కడికి పోతారు? ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం హైకోర్టుకు వెళ్లి హంగామా సృష్టించడం’ అని తెలిపారు. ‘హైకోర్టు ఆమోదిస్తే బాగుంటుంది, కానీ జడ్జి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. చట్టబద్ధంగా మాత్రమే ఇవ్వాలని మేము కోరుతున్నాం’ అని స్పష్టం చేశారు.‘బీసీ మంత్రులు మాత్రమే హైకోర్టుకు వెళ్లడం ఏమిటి? ఓబీసీ మంత్రులు వ్యతిరేకంగా ఉన్నారా? రేపటి ఎన్నికల ప్రక్రియ కోసం సంతోషంగా వెళ్లతాం. ఏ సమస్య వస్తే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి’ అని అన్నారు.‘బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎక్కడ? గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికీ జీవో ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం వస్తుందంటూ అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రయోగశాలగా మార్చడం మానుకోవాలి’ అని ఆయన అన్నారు. ‘బీసీలు, ఓబీసీల మధ్య విభేదాలు పుట్టేలా చర్యలు చేయకూడదు. కాంగ్రెస్ తమ రాజకీయ అవసరాల కోసం బీసీలను బలిపశువులు చేయడాన్ని నిలవదు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలి’ అని డిమాండ్ చేశారు.‘కేసు వేసిన వారు ఏ పార్టీకి చెందినవారో చూడాలి, కానీ మొత్తం సామాజిక వర్గాన్నే బాధగలరని అనుకోవద్దు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. గెలిచినవారి పదవులు కోల్పోకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa