ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 08:28 PM

నల్గొండ జిల్లా చిట్యాల మండల తహశీల్దార్ కృష్ణ నాయక్, ఒక రైతు నుండి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా, నల్గొండ ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం 6 గంటలకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు తహశీల్దార్ కృష్ణ నాయక్ ను కార్యాలయంలో విచారిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa