తెలంగాణ రాష్ట్రంలో మరో సర్వే ప్రారంభమైంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరిట ఈ సిటిజన్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సర్వే అక్టోబర్ 10, శుక్రవారం ప్రారంభమై, అక్టోబర్ 25వ తేదీ వరకు కొనసాగనుంది.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, రాష్ట్రాలు 2047 నాటికి లక్ష్యాలను నిర్ధేశించుకున్నప్పటి తరహానే, ఈ సర్వే ద్వారా తెలంగాణలో 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో వారి అభిప్రాయాలు, సూచనలను ఆన్లైన్లో స్వీకరించనుంది. దీని కోసం ప్రత్యేక వెబ్పోర్టల్ telangana.gov.in/telanganarising అందుబాటులోకి తీసుకువచ్చింది.గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహించింది. ఆ సర్వే కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు పెట్టి, ఆ గణాంకాలను వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లకు ఉపయోగించింది. తాజాగా మరో సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.“2047 లక్ష్యాలను నిర్దేశించుకుని, మీ స్వరం – మీ దృష్టి – మన భవిష్యత్తు” అనే పిలుపుతో ఈ సిటిజన్ సర్వే శుక్రవారం ప్రారంభమై, అక్టోబర్ 25వ తేదీ వరకు కొనసాగనుంది.రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేలో ప్రజలు ప్రతిష్టాత్మకంగా పాల్గొనాలని కోరుతోంది. ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు సేకరించేందుకు ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. సర్వే పూర్తి చేయడానికి కేవలం 5–6 నిమిషాలు మాత్రమే అవసరమని తెలిపారు. యువకులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వృద్ధులు — అన్ని వర్గాల వారు సర్వేలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. సర్వేలో ప్రధానంగా 8 అంశాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.సర్వేలో భాగంగా, మీ ప్రాంతానికి ముఖ్యంగా ఏం కావాలో వివరించడం అవసరం. జిల్లాలు లేదా మండలాలకి కావాల్సిన స్కూల్స్, ఆస్పత్రులు, ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక సేవలు తదితర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనడం సిఫార్సు చేయబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa