ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్, ఏ ప్లాట్ఫామ్ చూసినా AI వినియోగాన్ని కనుగొనవచ్చు. దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మానవుడు పరిష్కరించలేని సమస్యలు, సంక్లిష్టమైన ప్రశ్నలకు AI క్షణాల్లో సమాధానం ఇచ్చే సామర్థ్యం కలిగింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా AIను సమర్థవంతంగా వినియోగిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణ, ఇతర పబ్లిక్ సురక్షా ప్రణాళికలలో ఉపయోగిస్తున్నాయి.దేశంలోనే తొలి AI డిజిటల్ హైవే ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీన్ని దిల్లీ-గురుగ్రామ్ మధ్య ఉన్న ద్వారకా ఎక్స్ప్రెస్ వే పై ప్రారంభించారు. దీని ద్వారా ఆ రహదారి దేశంలోనే తొలి AI ఆధారిత డిజిటల్ హైవేగా గుర్తింపు పొందింది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో, ఇప్పుడు తెలంగాణలోని నేషనల్ హైవేలకు కూడా ఈ సాంకేతికతను అమర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు.ఈ డిజిటల్ హైవేలు AIతో పాటు పోలీస్, రవాణాశాఖలతో సమన్వయం ద్వారా పనిచేయనున్నారు. భవిష్యత్తులో నిర్మించే జాతీయ రహదారులను కూడా రాష్ట్ర కమాండ్ & కంట్రోల్ సెంటర్కు అనుసంధానించనున్నారు. ఈ సాంకేతికత జాతీయ రహదారులపై 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదు. సీటు బెల్ట్ లేకపోవడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, అధిక వేగం వంటి ఉల్లంఘనలన్నీ రియల్ టైమ్లో రికార్డు అవుతాయి. AI స్మార్ట్ కెమెరాలు వాహన వివరాలను నేరుగా NIC e-Challan పోర్టల్కు మరియు సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపిస్తాయి.అంతేకాకుండా, ట్రాఫిక్ పర్యవేక్షణ, వీడియో రికార్డింగ్, వెహికిల్ వేగం ట్రాకింగ్, అలెర్ట్ సైన్ బోర్డులు రోడ్ల పక్కన ఏర్పాటు చేయనున్నారు. ఈ టెక్నాలజీ వల్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే కాక, ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం కూడా అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలలోనూ ఇలాంటి AI ఆధారిత డిజిటల్ హైవేల ఏర్పాట్లు మొదలవ్వనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa