దాదాపు నాలుగేళ్ల పాటు ఆర్టీసీ ఎండీగా సేవలందించిన వీసీ సజ్జనార్ను.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా నియమించిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే వీఐపీలకు వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దని హెచ్చరించారు. నగరంలో డ్రగ్స్ కట్టడికి కూడా ప్రయత్నా చేస్తామని చెప్పారు. డ్రంగ్ డ్రైవ్ విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు. చెప్పినట్లుగానే సీపీ సజ్జనార్ తన మార్క్ పోలీసింగ్ చూపిస్తున్నారు. అందులో భాగంగా ' ఎక్స్ట్రా మైల్ రివార్డ్ ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మానవతా దృక్పథంతో పనిచేస్తూ.. ప్రజల మన్ననలు పొందే సిబ్బందిని ప్రోత్సహించేందుకే ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం (అక్టోబర్ 11) తొలిసారిగా అన్ని విభాగాలతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ కమిషనరేట్ చాలా పురాతనమైనదని చెప్పారు. అలాంటి కమిషనరేట్ ప్రతిష్ఠను మరింత పెంచాలని అన్నారు. అందుకే పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు.. సలహాలు, సూచనలు జారీ చేశారు సజ్జనార్.
ఎంటీ ఎక్స్ట్రా మైల్ ప్రోగ్రాం..?
ఎక్స్ట్రా మైల్ రివార్డ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి శనివారం ఉత్తమ పని తీరు కనబర్చిన సిబ్బందిని గుర్తిస్తారని సీపీ చెప్పారు. ఎంపిక చేసిన వారికి ప్రశంసాపత్రం, రివార్డుతో సన్మానిస్తారన్నారు. హైదరాబాద్ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కేసుల్లో లోతుగా విచారణ జరిపి.. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని చెప్పారు.
ఉత్తమ పోలీసులకు సీపీ ప్రశంసలు..
ఈ సమావేశం సందర్భంగా ఇటీవల ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసులను వీసీ సజ్జనార్ ప్రశంసించారు. ఇటీవల మాదన్నపేటలో జరిగిన చిన్నారి హత్య కేసును.. ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు సుధాకర్, శోభ, సాయికాంత్, శివకుమార్తో పాటు ఇతర సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. ఇక నిరాశ్రయులను ఆదరించి ఆశ్రమానికి తరలించిన అఫ్జల్గంజ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రవి, ఎస్ఐ నిరంజన్, ఏఎస్ఐ ధర్మేందర్ను ప్రశంసించారు. అంతేకాకుండా ఓ కేసులో 30 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ విజయ సుధాకర్, కానిస్టేబుల్ సురేందర్ను కూడా వీసీ సజ్జనార్ ప్రశంసించారు.
మరోవైపు, వాహనదారులకు ఇటీవల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. సిటీలో చాలా మంది వాహనదారులు.. ముఖ్యంగా క్యాబ్, ఆటో డ్రైవర్లు.. వాహనాన్ని నడుపుతున్నప్పుడు హెడ్ సెట్, ఇయర్ ఫోన్స్ వంటివి వాడుతున్నారని అన్నారు. ఇకపై ఇలాంటి వారు కనిపిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అలా చేసిన వారికి శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa