తెలంగాణలో వెనుకబడిన తరగతుల హక్కుల సాధన ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లను సాధించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ‘తెలంగాణ బీసీ జేఏసీ ని ఏర్పాటు చేశాయి. ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్గా వీజీ నారగోని ఏకగ్రీవంగా నియమితులయ్యారు. వీరితో పాటు మరో ఆరుగురు కీలక సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై కోర్టు ఏ కారణంతో స్టే ఇచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త బంద్కు ఆయన పిలుపునిచ్చారు."గత 76 ఏళ్లుగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పుడు దానికి అవమానం కూడా తోడైంది. మా హక్కుల కోసం చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు" అని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు. బీసీ సమాజం ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa