ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముసుగుదొంగల బీభత్సం.. గంటలో ఐదు ఇళ్లలో చోరీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 11:35 AM

హైదరాబాద్ లో ముసుగుదొంగలు బీభత్సం సృష్టించారు. కుత్బుల్లాపూర్ పేట్ బషీర్ బాద్ లో గంట వ్యవధిలో ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో చొరబడి ఒక కేజీ వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇళ్లలో దొంగతనం చేసే సమయంలో అలారం మోగడంతో పరారయ్యారు. మరోవైపు, హయత్ నగర్ లోని పెద్ద అంబర్ పేట్ లో రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. 5కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదు, విలువైన చీరలు ఎత్తుకెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa