ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్‌కర్నూల్‌లో దారుణం.. అడవిలో సగం కాలిన మహిళ మృతదేహం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:39 PM

TG: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో సగం కాలిన ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. అడవిలో దుర్వాసన రావడంతో గ్రామస్తులు దగ్గరగా వెళ్లి చూడగా ఈ దృశ్యం కనబడింది. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతదేహం తీవ్రంగా కాలిపోవడంతో మహిళ ఎవరో గుర్తించడం సాధ్యంకాలేదని తెలిపారు. మహిళ హత్యకు గురైందా, లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa