ఎల్. బి నగర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ లోకి భారీ చేరికలు.కండువా కప్పి యువజన కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కో ఇంచార్జి శ్రీ రోష్ని జైస్వాల్ గారు మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి. ఎల్. బి నగర్ నియోజకవర్గానికి చెందిన సంజు గౌడ్ గారి ఆధ్వర్యంలో నేడు ఎల్. బి నగర్ నియోజకవర్గం లో పలు డివిజన్ ల నుండి భారీగా యువకులు యువజన కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అనంతరం ఎల్.బి నగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సంజు గౌడ్ గారిని నియమిస్తూ..నియామక పత్రాన్ని అందజేసిన రోష్ని జైస్వాల్ గారు మరియు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరమల రాం రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి చంద్రిక గారు, కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయ డైరెక్టర్ విష్ణు రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు శివ గారు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa