సమాజాన్ని మార్చే ఏకైక ఆయుధం విద్యనే అంటారు. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే, అందరికి సమాన అవకాశాలు కల్పించి, ఆ వర్గాల విద్యార్ధులను విద్యాసంస్కృతితో పరిపూర్ణులుగా మార్చడమే ముఖ్యమని మహానుభావులు మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వసించి, ఈ లక్ష్యానికి గరిష్టంగా కృషి చేశారు.ఈ మహానుభావుల స్ఫూర్తిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. కేవలం బీసీ రిజర్వేషన్లు పెంచడంలోనే కాకుండా, ఎస్సీ వర్గాల విభజన వంటి విధానాలపై దృష్టి పెట్టడమే కాదు, వారి పిల్లలను విద్యార్ధులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది.అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో పీజీ, పీహెచ్డీ కోర్సులు చదవడానికి ప్రభుత్వం స్కాలర్షిప్లు అందిస్తోంది. ఈ పథకాలు ప్రారంభమైనప్పటినుండి ఆసక్తి రెట్టింపు అయ్యింది. అయితే, గత ప్రభుత్వం పథకాలను సమీక్షించి అర్హుల సంఖ్య పెంచకపోవడంతో వేలాది అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని పొందలేకపోయారు.విదేశాల్లో ఉన్నత విద్య చదవడం అనేది చాలామందికి కల. కానీ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా ఆ దిశగా ఆలోచించలేరు. అలాంటి వారికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకాలు వరం లాగా ఉన్నాయి. ఇలాంటి నేపధ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిభ ఉన్నా ఉన్నత విద్యకు చేరుకోలేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు సహాయం అందించాలని నిర్ణయించింది.ఇది వారి జీవితాల్లో గేమ్చేంజర్గా మారే పథకాల అమలు కోసం స్కాలర్షిప్ల సంఖ్యను రెట్టింపు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విదేశాల్లో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గడచిన కాలంలో ఈ మూడు పథకాల కింద లబ్దిదారుల సంఖ్య 1,110గా ఉండగా, కొత్త ప్రజా ప్రభుత్వ నిర్ణయంతో 1,900కు చేరింది.మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 300 మంది బీసీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇందులో ఈబీసీల కోసం కేవలం 15 సీట్లు ఉండేవి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సంఖ్యను 700కి పెంచింది. ఇందులో 500 బీసీ విద్యార్థులకు, 200 ఈబీసీ విద్యార్థులకు కేటాయించారు. అంటే బీసీ విద్యార్థులకు లభించే అవకాశం సుమారు 133 శాతం పెరిగింది. ప్రస్తుతం 500 మంది బీసీ-సీ, బీసీ-ఈ వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్ పొందుతున్నారంటే, కొత్తగా మరో 500 మంది బీసీ విద్యార్థులు కూడా లబ్ధిదారులుగా మారతారు. మొత్తం దృష్ట్యా ఏడాది లక్ష్యం 1,000 మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం.అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 210 మంది ఎస్సీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సంఖ్యను 500కి పెంచింది. అంటే ఎస్సీ విద్యార్థులకు లభించే అవకాశాలు 138 శాతం పెరిగాయి. అలాగే ఎస్టీ విద్యార్థులకు గతంలో 100 సీట్లు కేటాయించబడినవి. ఇప్పుడు వాటిని 200కి పెంచి 100 శాతం వృద్ధి చేశారు.ఈ విధంగా ప్రజా ప్రభుత్వం రెట్టింపు సంక్షేమంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల జీవితాల్లో స్ఫూర్తిదాయకమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa