ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరి పొలాల్లో చీడపీడల నివారణపై ఏఓ రాజశేఖర్ సూచనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:34 AM

నర్సాపూర్ చిలిపిచెడ్ గ్రామంలో ఏఓ రాజశేఖర్ రైతుల వరి పొలాలను సందర్శించి, చీడపీడల నివారణపై సూచనలు చేశారు. వరి పంటలో సుడిదోమ, కంకినల్లి, మెడవిరుపు తెగుళ్లను గమనించిన రైతులు వెంటనే నీటిని తగ్గించాలని, తీవ్రత ఎక్కువగా ఉంటే ట్రైఫ్లూమెజోపైరం లేదా ఇమిడాక్లోప్రిడ్ వంటి మందులను పిచికారి చేయాలని సూచించారు. కంకినల్లి నివారణకు స్పైరోమెసిఫేన్, మెడవిరుపు తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్, ఐసోప్రోథాయోలేన్, కాసుగామైసిన్ వంటి మందులను వాడాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa