ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్యాన్ని ప్రజల ముందు ఉంచడమే జర్నలిస్టుల అసలు బలం : కాట సునీత రాజేష్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:42 AM

శనివారం నాడు కాట సునీత రాజేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్‌లో, మాజీ చైర్మన్ చేస్తున్నటువంటి అరాచకాలు, నిజాలను నిర్భయంగా సునీతమ్మ గారు ధైర్యంగా వెల్లడించారు అన్న విషయం అందరికీ తెలిసిందే.ఆ ప్రెస్ మీట్‌కు హాజరైన జర్నలిస్టులు (రిపోర్టర్లు) కొంతమంది నిజాయితీ వైపు నిలబడి, ధైర్యంగా వీడియోలను విడుదల చేయడం అభినందనీయ విషయంఅయితే ఇంకొంతమంది బెదిరింపులకు భయపడి వీడియోలను విడుదల చేయకపోవడం, కొందరు తీసేసేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.జర్నలిజం అంటే నిజాలను  భయపడకుండా బయటకు తీసుకురావడం.‼️అది ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభం — బెదిరింపులకు లేదా ఒత్తిడికి లోనుకాకుండా సత్యాన్ని ప్రజల ముందు ఉంచడమే జర్నలిస్టుల అసలు బలం..


కానీ నిజం ఎప్పటికైనా వెలుగులోకే వస్తుంది, గెలుపు ఎల్లప్పుడూ నిజాయితీ వైపే ఉంటుంది అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అలాగే మన మీడియా మిత్రువులందరూ అధైర్య పడకుండ ధైర్యం గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం……రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సమస్యలు, నిజాలు, అరాచకాల మీద పోరాడుతాం….కావున ఎవరు ఎవరికి భయపడాల్సిన పనిలేదు అని కాట సునీత రాజేష్ గౌడ్ తెలిపారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa