ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవ కేంద్రం భవనాన్ని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 12:59 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవ కేంద్రం భవనాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ శ్రీదేవితో కలిసి ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో పౌరసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నూతన మున్సిపాలిటీల ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఫాల్గుణ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa