తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదిలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో వాతావరణంలో అస్థిరత ఏర్పడి, వర్షాలకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa