ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 05:18 PM

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదిలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో వాతావరణంలో అస్థిరత ఏర్పడి, వర్షాలకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa