బీసీ బంద్, బ్యాంకుల బంద్ల కారణంగా మద్యం షాపులకు దరఖాస్తులు సమర్పించలేకపోయిన ఉత్సాహకుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ తెలిపారు. మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఈనెల 23వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఇంతకు ముందు ఈనెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన డ్రా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ, ఈనెల 27వ తేదీన డ్రాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa