ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధ విమానాల గగనతల విన్యాసాలను తిలకించిన మోడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 05:05 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళిని నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకుంటున్నారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై పర్యటించిన ఆయన, భారత సైనిక సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. సోమవారం (అక్టోబర్ 20) జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రధాని యుద్ధ విమానాల గగనతల విన్యాసాలను తిలకించి, సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిగ్-29 యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్న తీరును ప్రధాని ఆసక్తిగా గమనించారు. పగలు, రాత్రి వేళల్లో జరిగిన ఈ వైమానిక శక్తి ప్రదర్శనలో నౌకాదళ పైలట్ల నైపుణ్యం, కచ్చితత్వాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ఐఎన్ఎస్ విక్రాంత్ 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తికి, దేశ స్వావలంబన శక్తికి ఒక ప్రబల నిదర్శనమని అభివర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa