జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఒక్క స్థానం కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడుతుండటంతో ఇక్కడ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. నామినేషన్ల స్వీకరణకు మంగళవారంతో గడువు ముగియనుండగా, ఇప్పటికే 127 మంది తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, చిన్న పార్టీల ప్రతినిధులు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే దివంగత ఎమ్మెల్యే సతీమణి మాగంటి సునీతా గోపీనాథ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్రావు సహా ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ నెల 13న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. దాఖలైన నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు అవకాశం కల్పించారు. అనంతరం నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపును నవంబర్ 14న చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు మరో సెట్ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవడంతో తుది అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa