తెలంగాణ ప్రభుత్వం గర్వంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి మచ్చ తొలగకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని రేగళ్లపాడు గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివ మాధవ్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బు డిమాండ్ చేశాడనే తీవ్ర ఆరోపణలు రాగా, బాధితులు సాహసోపేతంగా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఫిర్యాదు అందిన వెంటనే హౌసింగ్ శాఖ ఎండీ వి.పి. గౌతమ్ లైట్నింగ్ స్పీడ్లో స్పందించారు. ఆయన తక్షణం హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ను విచారణ అధికారిగా నియమించి, లోతుగా దర్యాప్తు చేయించారు. ఈ వేగవంతమైన చర్య ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ వైఖరిని స్పష్టంగా చూపించిందని అధికార వర్గాలు తెలిపాయు.
విచారణ నివేదిక ఆధారంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివ మాధవ్ను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ సస్పెన్షన్ ఆదేశాలు లబ్ధిదారుల్లో భరోసా నింపడమే కాకుండా, మిగతా అధికారులకు హెచ్చరికగా పనిచేస్తున్నాయి.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహ పథకంలో ఇలాంటి అక్రమాలు జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల తక్షణ చర్యతో లబ్ధిదారులు ఉపశమనం వ్యక్తం చేస్తూ, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అమలు చేయాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa