తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపిన వివరాల ప్రకారం, 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మూడు విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఆ గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులు అందజేస్తానని ప్రకటించారు. గత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాయని, ఈసారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. గ్రామాల అభివృద్ధికి నిధులు అందిస్తున్నది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa