ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ యాంటీ-డ్రోన్ గస్తీ వాహనం 'ఇంద్రజాల్ రేంజర్'ను ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆవిష్కరించారు. రాయదుర్గం టీ హబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్ లో డ్రోన్ల పాత్ర ఆందోళనకరంగా మారుతుందని, దేశ భద్రతకు ఇది కీలకమని పాండే అన్నారు. 26/11 దాడి జరిగిన రోజును ఎంచుకోవడానికి కారణాన్ని వివరిస్తూ, డ్రగ్స్ రవాణాలో డ్రోన్ల వాడకాన్ని అరికట్టడానికి ఈ వాహనం ఉపయోగపడుతుందని సీఈవో కిరణ్ రాజు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa