సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్ నాయక్ మరోసారి సర్పంచ్ పీఠం అధిష్ఠించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల ఆశీర్వాదం, స్థానిక ఎమ్మెల్యే–ఎంపీల సహకారం, పార్టీ నాయకులు, అభిమానుల అండతో తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ప్రచార రంగంలోకి దిగారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థులకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు వెంకట్ నాయక్. ఇప్పటికే ప్రజల్లో మంచి పేరున్న ఆయన, మళ్లీ అవకాశం ఇస్తే గ్రామాన్ని విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు.
గతంలో సర్పంచ్ గా ఉన్న కాలంలో మాజీ ఎమ్మెల్యే మద్ది శ్రీధర్ రెడ్డి సహకారంతో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలను అందించిన ఘనతను గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవంతోనే మళ్లీ బరిలోకి దిగుతున్నానని, ఆ పనులను మరింత వేగవంతం చేస్తానని ఆయన చెబుతున్నారు.
తిమ్మాపూర్ తండా ప్రజలు మళ్లీ తమ సొంత నాయకుడికి అవకాశం ఇస్తారని వెంకట్ నాయక్కు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తూ గెలుపు గుర్రాన్ని తానే అని నిరూపించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిమ్మాపూర్ తండా నుంచి కాంగ్రెస్ విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa