ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. మున్సిపల్ కార్మికుడు దుర్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 11:29 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో శనివారం ఉదయం రోడ్డు మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, వాటర్ ట్యాంక్ మధ్యలో చిక్కుకున్న కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa